సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Monday, August 9, 2010

మహిళలు-సోషలిజం పుస్తకం ఒక్క రోజులోనే 400 కాపీలు అమ్మకం

'మహిళలు సోషలిజం' పుస్తకానికి విశేషాదరణ లభిస్తోంది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఆదివారం విడుదల చేసిన 'మహిళలు - సోషలిజం' పుస్తకం ఒక్క రోజులోనే 400 కాపీలు ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ప్రత్యేక స్టాల్‌లో అమ్ముడయ్యాయి. ఇది అరుదైన పుస్తకమనీ, ఆలస్యంగానైనా అందుబాటులోకి తేవడం సంతోషకరంగా ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కరత్‌ అన్నారు.

ఎర్రజెండా నీడలోనే మహిళకు నిజమైన గౌరవం

  • బెంగాల్‌ మహిళా ఉద్యమ మణిపూస శ్యామలీ గుప్తా
కమ్యూనిస్టుల పాలనలోనే మహిళలకు సంపూర్ణ గౌరవం సాధ్యమౌతుందని సిపిఎం బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు శ్యామలీ గుప్తా వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో మూడున్నర దశాబ్ధాల వామపక్షాల పరిపాలనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మహిళా సాధికారత, స్వేచ్ఛ, రాజకీయ భాగస్వామ్యం, సమాన వేతనాలు తదితర నినాదాలను బూర్జువా పార్టీలు ఉపన్యాసాలకే పరిమితం చేయగా...

అమూల్యం... స్ఫూర్తిదాయకం

  • ఫోటో ఎగ్జిబిషన్‌కు విశేష ఆదరణ
సిపిఎం కేంద్ర కమిటీ విస్తృత సమావేశాల నేపథ్యంలో ఇక్కడి షహీద్‌ నగర్‌ (తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం)లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌కు ప్రతినిధుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. సిపిఎం ఆవిర్భావానికి సంబంధించిన ఎంతో అమూల్యమైన ఫోటోలను ఎగ్గిబిషన్‌లో ఏర్పాటు చేశారు. మొత్తం 5 విభాగాలుగా ఫోటోలను పొందుపరిచారు. 1964లో తెనాలిలో జరిగిన పార్టీ ఆవిర్భావ సదస్సు, అదే ఏడాది కోల్‌కతాలో జరిగిన పార్టీ అఖిల భారత మహాసభ, 1982లో విజయవాడలో జరిగిన పార్టీ 11వ అఖిలభారత మహాసభ ఫోటోలతో పాటు పార్టీ వ్యవస్థాపక నేతలు సుందరయ్య, బసవపున్నయ్యకు చెందిన అమూల్యమైన చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. తెనాలి సదస్సు, విజయవాడ మహాసభ ఫోటోలు సీనియర్‌ నేతలకు ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.

కుల గోడలు బద్దలు కొట్టాం

  • దళితుల పట్ల 82 రకాల వివక్ష
  • ఉద్యమాల వల్ల అరుంధతీయులకు 3 శాతం రిజర్వేషన్లు
  • 'తమిళనాడు 'అంటరానితనం నిర్మూలన వేదిక'
  • ప్రధాన కార్యదర్శి సంపత్‌
దళితులను రానివ్వకుండా వివిధ దేవాలయాలకు అగ్రవర్ణాలవారు నిర్మించిన 'కుల గోడల్ని' ప్రజా సంఘాల సహకారంతో అంటరానితనం నిర్మూలన వేదిక బద్ధలు కొట్టిందనీ ఆ వేదిక తమిళనాడు ప్రధాన కార్యదర్శి సంపత్‌ తెలిపారు. తాము నిర్వహించిన ఆందోళనల వల్ల అరుంధతీయులకు (మన రాష్ట్రంలో మాదిగలతో సమానం) ఎస్సీ కోటాలో 3 శాతం రిజర్వేషన్లు (ఉప కోటా) లభించాయనీ వివరించారు. హోటళ్లలో రెండుగ్లాసుల పద్ధతి,

శ్రీశ్రీ అంటేనే ఉత్తేజం

  • సీతారాం ఏచూరి
  • మహాకవికి షహీద్‌నగర్‌లో శతజయంతి నివాళి
సిపిఎం విస్తృత సమావేశాలు జరుగుతున్న షహీద్‌నగర్‌ (తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం) ప్రాంగణంలో ఉన్న ప్రజాకవి శ్రీశ్రీ విగ్రహం వద్ద పార్టీ అగ్రనాయకులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మహాకవికి జేజేలు అర్పించారు. తన కలాన్నీ, కవిత్వాన్నీ కష్టజీవుల విముక్తికీ, కమ్యూనిస్టు ఉద్యమ వికాసానికీ అంకితమిచ్చిన శ్రీశ్రీ చిరస్మరణీయుడనీ వారు పేర్కొన్నారు. సోమవారం ఉదయం సిపిఎం సమావేశాలు జరుగుతున్న

'పెట్రో' పెంపు, అధిక ధరలపై ఉధృత పోరు

  • అస్థిత్వ రాజకీయాలతో ప్రజా సమస్యలు పక్కదారి
  • ప్రజాశక్తి ఇంటర్వ్యూలో ప్రకాశ్‌ కరత్‌
'పెట్రో ధరల పెంపు, అధిక ఆహార ద్రవ్యోల్బణంపై దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. జూలై 5న దేశవ్యాప్తంగా జరిగిన హర్తాళ్‌ గత రెండు దశాబ్దాల కాలంలో జరిగిన అతిపెద్ద ఆందోళన. ఈ స్ఫూర్తితో రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలకు రూపకల్పన చేస్తాం' అని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ చెప్పారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ-2 ప్రభుత్వం అనుసరిస్తోన్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న శ్రామికవర్గానికి నష్టదాయకంగా పరిణమించాయన్నారు. ఈ విధానాల వల్ల పేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై అధిక భారాలు పడుతున్నాయన్నారు. వీరందరినీ సమీకరించి శ్రామికవర్గ పోరాటాలకు

రేపే భారీ బహిరంగ సభ

  • విజయవాడలో విస్తృత ఏర్పాట్లు
  • మధ్యాహ్నం 2 గంటలకు ప్రదర్శన
  • 3 గంటలకు సభ
సిపిఎం జాతీయ విస్తృత సమావేశాల ముగింపు రోజైన మంగళవారం విజయవాడలో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచీ ప్రజలు తరలి రానుండటంతో