సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Wednesday, March 25, 2009

కాంగ్రెస్‌ది మేకపోతు గాంభీర్యం:నోముల నర్సింహయ్య

జనగామ : రాష్ట్రంలో ఆరిపోయే దీపంలా మారిన కాం గ్రెస్‌పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నదని సీపీఎం శాసనసభా పక్షనాయకుడు నోముల నర్సింహయ్య అన్నారు. బుధవారం వరంగల్‌ జిల్లా జనగామలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం మహాగొప్పదంటు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు పార్టీ మేనిఫెస్టోలో ఎందుకు చేర్చలేదో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

ఆరోగ్యశ్రీ పథకంలో లోపాలున్నాయని, తాముచెబితే పట్టించుకోకుండా అప్పణంగా కోట్లాదిరూపాయలు ముట్టచెప్పారని విమర్శించారు. తెలంగాణలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎండిపోతున్నా పట్టించుకోని ప్ర భుత్వం కృష్ణాజలాలను మాత్రం పోతిరెడ్డిపాడుకు తరలించుకపోయిందన్నారు.

తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రాణప్రదమైన గోదావరి జలాలు అందాలంటే 360రోజులు నీటినిల్వ ఉండాలని, అందుకుగాను కంతనపల్లివద్ద రిజర్వాయర్‌ నిర్మించాలన్నారు. వరంగల్‌ జిల్లాలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించలేకపోయారని ఎద్దేవా చేశారు. దళితులు, మైనార్టీలకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌పార్టీని ఓ డించేందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

No comments:

Post a Comment