సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Saturday, March 28, 2009

10 మంది అభ్యర్థులతో సీపీఎం తొలిజాబితా

హైదరాబాద్‌ : ఎన్నికల్లో ఇరవై అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తామంటూ ఆ స్థానాల జాబితాను కూడా విడుదల చేసిన సీపీఎం.. వాటిలో సగం సీట్లకు శుక్రవారం అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ అభ్యర్థుల తొలిజాబితాను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావులు విడుదల చేశారు. మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజు ఇప్పటికే నామినేషన్‌ వేశారని, మిగిలినవారు శని, సోమవారాలలో దాఖలు చేస్తారని చెప్పారు. వైరా, వరంగల్‌ తూర్పు, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ఉప్పల్‌, గాజువాక, ఆచంట, మంగళగిరి, నెల్లూరు గ్రామీణ, అనంతపురం అసెంబ్లీ స్థానాలపై తెదేపాతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇవి ఫలప్రదమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మహాకూటమిలోని నాలుగు పార్టీల మధ్య వివాదం లేని సీట్లను మాత్రమే తాము తొలిజాబితాలో ప్రకటించామని చెప్పారు. ఆదివారం తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం భేటీ అవుతుందని, మిగిలిన సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసి వెల్లడిస్తామని తెలిపారు.

అభ్యర్థులు :

భద్రాచలం (ఎస్టీ): సున్నంరాజయ్య; మధిర (ఎస్సీ): లింగాల కమల్‌రాజు; పాలేరు: తమ్మినేని వీరభద్రం; మిర్యాలగూడ: జూలకంటి రంగారెడ్డి; నల్గొండ: నంద్యాల నరసింహారెడ్డి; నకిరేకల్‌(ఎస్సీ): మామిడి సర్వయ్య; కురుపాం (ఎస్టీ): కోలక లక్ష్మణమూర్తి; విజయవాడ పశ్చిమ: సి.హెచ్‌.బాబూరావు; సంతనూతలపాడు (ఎస్సీ): జాలా అంజయ్య; కర్నూలు: ఎం.ఎ.గఫూర్‌.

No comments:

Post a Comment