సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Saturday, August 7, 2010

పోరాటాలకు స్ఫూర్తిదాయకం

  • ఎగ్జిబిషన్‌ ప్రారంభించిన రాఘవులు
అనేక పోరాటాల సమాచారం,ఫోటోలను ఒకచోట చేర్చి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్ఫూర్తిదాయకంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. దేశంలో పేరెన్నికగన్న వర్లీ ఆదివాసుల తిరుగుబాటు, తెభాగ, ఆంధ్రప్రదేశ్‌ భూ పోరాటాలు, సామ్రాజ్యవాద ప్రమాదాన్ని వివరించే ఎన్నో చిత్రాలను ఇందులో ఏర్పాటు చేశామన్నారు. సిపిఎం విస్తృత సమావేశాల సందర్భంగా స్థానిక గాంధీనగర్లో కందుకూరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ భవిష్యత్తులో సరళీకరణ విధానాలు, సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడే


శక్తులకు ఈ ఎగ్జిబిషన్‌ మరింత స్ఫూర్తి నింపుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పేదలు మరింత నిరుపేదలవుతున్నారన్నారు. శనివారం నుండి మూడు రోజులపాటు జరిగే విస్తృత సమావేశాల్లో వీటిపై చర్చిస్తామని తెలిపారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వంటి విధానాలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం, దాని అనుచరులు ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు. గతంలో వామపక్షాలు మద్దతిచ్చినంతకాలం యుపిఎ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. దీనికి వ్యతిరేకంగా అన్ని పక్షాలను కలుపుకొని ఐక్యపోరాటాలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. అటువంటి పోరాటాలకు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన అనేక ఘట్టాలు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌ ఇన్‌ఛార్జి సత్యరంజన్‌, వెలగా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. సుమారు 500 ఎగ్జిబిట్లను ఇందులో ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment