సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Monday, August 9, 2010

విప్లవ స్ఫూర్తిని రగిలిస్తున్న అమరవీరుల చిహ్నం

 
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల సందర్భంగా షహీద్‌నగర్‌ (తుమ్మలపల్లి కళాక్షేత్రం)లో ఏర్పాటుచేసిన అమరవీరుల చిహ్నం రాబోయే తరాలకు విప్లవ స్ఫూర్తిని అందిస్తోంది. భూమి నుండి వచ్చిన చేయి ఎర్రజెండాను అందిస్తున్నట్లుగా ఉన్న ఈ చిహ్నం చూస్తుంటేనే పోరాట స్ఫూర్తి రగులుతోంది. కర్రతో ఏర్పాటు చేసిన ఈ చిహ్నం మోచేతివరకూ భూమిలో ఉంది. అక్కడ నుండి పైకొచ్చి జెండాను పట్టుకుంది. దీనిపై సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోరాటవీరులు ప్రాణాలర్పించినా భావితరాలకు స్ఫూర్తిని అందిస్తున్నట్లు, భూమిలో కలిసిపోయినా సరే రానున్న తరాలను చైతన్యం చేయాలన్నట్లు ఈ చిహ్నం ఏర్పాటు చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి చిహ్నం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారన్నారు. ఈ చిహ్నం చుట్టూ ఏర్పాటు చేసిన పూలు వాడిపోకుండా ఏరోజుకారోజు మారుస్తున్నారు.

No comments:

Post a Comment