సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Monday, August 9, 2010

స్పందింపజేస్తున్న ఎగ్జిబిషన్‌


సిపిఎం విస్తృత సమావేశాల సందర్భంగా గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణమండపంలో ఏర్పాటుచేసిన ఫొటోఎగ్జిబిషన్‌కు ఆదివారం ప్రజలు తరలివచ్చారు. వర్లీ, తెభాగ, పున్నప్ర వాయలార్‌, ఆంధ్రప్రదేశ్‌లో భూపోరాటం వంటి ఘట్టాలతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ పలువురిని విశేషంగా ఆకర్షిస్తోంది. అణుబాంబుల వల్ల కలిగే నష్టాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఏర్పాటు చేసిన అనేక చిత్రపటాలు విద్యార్థులను ఆలోచింపజేస్తున్నాయి. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై బాంబు వేసినప్పటి నుండి ఇప్పటి వరకూ అమెరికా చేస్తున్న అనేక దురాగతాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటోలు స్పందింపజేస్తున్నాయి. విద్యార్థులు, యువకులు ఎక్కువగా ఈ ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్నారు. సాయంత్రం కళారూపాలు కూడా ఉండటంతో ఎక్కువమంది ఇక్కడకు చేరుకుంటున్నారు. దీంతో ఎగ్జిబిషన్‌ ప్రాంగణం, కళారూపాల ప్రాంగణం వీక్షకులతో నిండిపోయంది.

No comments:

Post a Comment